న్యూఢిల్లీ: రూ.రెండు వేలుపైబడిన యూపీఐ లావాదేవీలపై 0.5 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్)విధించడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువని ఫైనాన్షియల్ టెక్నాలజీ నిపుణులు అంటున్నారు. ఈ చార్జీని ఎవరు భరిస్తారనే దానిపై దృష్టి పెట్టాలని చెబుతున్నారు. ఎండీఆర్ భారం వ్యాపారులకు అదనపు నిర్వహణ ఖర్చు అవుతుంది.
లాభాలను, వినియోగదారులకు ఇచ్చే డిస్కౌంట్లను తగ్గిస్తుంది. ముఖ్యంగా చిన్న కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారస్తులపై ఎండీఆర్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రూ.10 వంటి తక్కువ విలువ గల యూపీఐ పేమెంట్లను వ్యాపారులు తిరస్కరించే ప్రమాదం ఉంది. దీనివల్ల డిజిటల్ చెల్లింపుల వేగం తగ్గుతుందని ఫిన్టెక్ ఎక్స్పర్టులు అంటున్నారు.
