అనంతగిరి గుట్టకు వెళ్తుంటే.. చెట్టుకు ఢీకొని మృతి

అనంతగిరి గుట్టకు వెళ్తుంటే.. చెట్టుకు ఢీకొని మృతి

చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు గేటు వద్ద కారు చెట్టును ఢీకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నారు. ప్రమాదం జరగడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు సోనీ, ప్రదీప్ గా పోలీసులు గుర్తించారు. మరో ఇద్దరు ఆర్య, క్రాంతిలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఉస్మానియా ఆసుత్రికి తరలించారు. 

ALSOREAD:కీసర గుట్ట దారిలో బ్లాస్టింగ్.. ఒకరికి తీవ్ర గాయాలు

నిన్న(సెప్టెంబర్ 09) హైదరాబాద్ నుంచి వికారాబాద్ జిల్లా అనంతగిరిగుట్ట పర్యటనకు స్టూడెంట్స్ వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఈరోజు(సెప్టెంబర్ 10) ఉదయం తిరిగి హైదరాబాద్ కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్టూడెంట్స్ నలుగురూ.. వివిధ ఇంజనీరింగ్ కాలేజ్ లకు చెందిన స్టూడెంట్స్ గా పోలీసులు గుర్తించారు. తెల్లవారుజామున వర్షం పడుతుండడంతో కారు ఒక్కసారిగా స్కిడ్ కావడంతో అదుపుతప్పి ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. నలుగురు విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చామని  పోలీసులు తెలిపారు.