Nagabandham: అనంత పద్మనాభ స్వామి ఆలయం సెట్‌‌‌‌.. ‘నాగబంధం’ 10 నిమిషాల కోసం 10 కోట్లు..

Nagabandham: అనంత పద్మనాభ స్వామి ఆలయం సెట్‌‌‌‌.. ‘నాగబంధం’ 10 నిమిషాల కోసం 10 కోట్లు..

విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘నాగబంధం’. అభిషేక్ పిక్చర్స్‌‌‌‌తో కలిసి ఎన్‌‌‌‌ఐకే స్టూడియోస్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై కిషోర్ అన్నపురెడ్డి నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా అనంత పద్మనాభస్వామి టెంపుల్‌‌‌‌ సెట్‌‌‌‌ను నిర్మించారు. ‘ఒక్కడు’లో ఛార్మినార్ సెట్‌‌‌‌ సహా పలు చిత్రాలకు పాపులర్ సెట్స్‌‌‌‌ను నిర్మించిన అశోక్ కుమార్ దీనికి వర్క్ చేశారు. ఈ సెట్ నిర్మాణానికి దాదాపు 6 కోట్ల రూపాయలు ఖర్చయినట్లు సమాచారం. 

కేరళలోని ఒరిజినల్ టెంపుల్‌‌‌‌కు అతి దగ్గరగా ఏర్పాటుచేసిన ఈ సెట్‌‌‌‌లో ప్రస్తుతం కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్  కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య పర్యవేక్షణలో విరాట్ కర్ణతో పాటు ఐదు వేల మంది నృత్య కళాకారులు ఇందులో పాల్గొంటున్నారు. సినిమాలో వన్‌‌‌‌ ఆఫ్​ ది హైలైట్‌‌‌‌ గా ఇది నిలవబోతోందని, ఈ ఒక్క ఎపిసోడ్‌‌‌‌కు సుమారు రూ.10 కోట్ల వరకూ ఖర్చు చేస్తున్నట్టు మేకర్స్ తెలియజేశారు.

గుప్త నిధులకు పురాణ ఇతిహాసాలను మిళితం చేస్తూ విష్ణు దేవాలయాల చుట్టూ ఉన్న రహస్యాన్ని జోడించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నభా నటేష్, ఐశ్వర్యా మీనన్ హీరోయిన్స్‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, జయప్రకాశ్, మురళీ శర్మ, బీఎస్ అవినాష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.