
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘నాగబంధం’. అభిషేక్ పిక్చర్స్తో కలిసి ఎన్ఐకే స్టూడియోస్ బ్యానర్పై కిషోర్ అన్నపురెడ్డి నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా అనంత పద్మనాభస్వామి టెంపుల్ సెట్ను నిర్మించారు. ‘ఒక్కడు’లో ఛార్మినార్ సెట్ సహా పలు చిత్రాలకు పాపులర్ సెట్స్ను నిర్మించిన అశోక్ కుమార్ దీనికి వర్క్ చేశారు. ఈ సెట్ నిర్మాణానికి దాదాపు 6 కోట్ల రూపాయలు ఖర్చయినట్లు సమాచారం.
కేరళలోని ఒరిజినల్ టెంపుల్కు అతి దగ్గరగా ఏర్పాటుచేసిన ఈ సెట్లో ప్రస్తుతం కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య పర్యవేక్షణలో విరాట్ కర్ణతో పాటు ఐదు వేల మంది నృత్య కళాకారులు ఇందులో పాల్గొంటున్నారు. సినిమాలో వన్ ఆఫ్ ది హైలైట్ గా ఇది నిలవబోతోందని, ఈ ఒక్క ఎపిసోడ్కు సుమారు రూ.10 కోట్ల వరకూ ఖర్చు చేస్తున్నట్టు మేకర్స్ తెలియజేశారు.
A grand replica of the Sree Padmanabhaswamy Temple has been magnificently erected for #Nagabandham at Ramanaidu Studios, Nanakramguda, with an awe-inspiring budget of ₹6 Crores.
— IndiaGlitz Telugu™ (@igtelugu) June 18, 2025
Meticulously crafted over 3.5 months by renowned art director Ashok, this set stands as a testament… pic.twitter.com/Sa8HJdCTi4
గుప్త నిధులకు పురాణ ఇతిహాసాలను మిళితం చేస్తూ విష్ణు దేవాలయాల చుట్టూ ఉన్న రహస్యాన్ని జోడించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నభా నటేష్, ఐశ్వర్యా మీనన్ హీరోయిన్స్గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, జయప్రకాశ్, మురళీ శర్మ, బీఎస్ అవినాష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.