జోగురామన్నకు సారీ చెప్పిన అనసూయ

జోగురామన్నకు సారీ చెప్పిన అనసూయ

నల్లమల్ల అడవుల్లో యురేనియం తవ్వకాలపై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద రచ్చ జరుతోంది. సెలబ్రీటీలు, ప్రజాసంఘాలు ఇలా పలువురు యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తున్నారు. సేవ్ నల్లమల ట్యాగ్ తో సోషల్ మీడియాలో పెద్ద యుద్దమే నడుస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగు యాంకర్ అనసూయ భరద్వాజ్ నల్లమల అడవులను కాపాడాలంటూ ఏపీ,తెలంగాణ అటవి శాఖ మంత్రుల పేర్లను ట్యాగ్ చేసింది. అయితే ఏపీ అటవి శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ ను ట్యాగ్ చేసిన అనసూయ తెలంగాణ అటవి శాఖ మంత్రి విషయంలో పొరపాటున మాజీ మంత్రి జోగురామన్న పేరును ట్యాగ్ చేసింది. దీనిపై కామెంట్లు రావడంతో అసలు విషయం తెలుసుకున్న అనసూయ జోగురామన్నకు క్షమాపణలు చెప్పింది. తనకు కరెంట్ అఫైర్స్ మీద పెద్దగా అవగాహన లేదని పొరపాటున ట్యాగ్ చేశానని చెప్పింది. అటవి శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని ట్యాగ్ చేసి మరో ట్వీట్ చేసింది.