
యాంకర్ గా, నటిగా రష్మి గౌతమ్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ ముద్దుగుమ్మ నెట్టింట్లో ఎంతో చురుగ్గా ఉంటుంది. సోషల్ మీడియాలో తను పెట్టె పోస్టులకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంది. అయితే కొన్నిసార్లు విమర్శలు వస్తుంటాయి. అలాంటి కామెంట్లు చేసే వాళ్లకు తను ధీటుగా జవాబిస్తుంటుంది. తాజాగా రష్మిని ఓ నెటిజన్ తీవ్రంగా బెదిరించాడు. ఆ స్క్రీన్ షాట్ షేర్ చేసిన ఆమె దీనిపై ఫిర్యాదు చేయాలా..వద్ధా ? అని నెటిజన్లను ప్రశ్నిస్తూ పోస్ట్ చేసింది.
అసలు విషయానికొస్తే.. హైదరాబాద్లో ఇటీవల వీధి కుక్కల దాడికి ఓ బాలుడు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రష్మి చాలా ఎమోషనల్ అయ్యింది. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా తెలిపింది. అయితే ఆమె మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ కొందరు ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తుంటే... మరికొందరు బెదిరిస్తూ మెసేజ్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ ‘‘ నీ మీద చేతబడి చేయిస్తా. నువ్వు రోడ్డు మీద తిరగకు. ఇంట్లోనే ఉండు. నీ మీద యాసిడ్ పోస్తా. మొండిగా ప్రవర్తిస్తే కష్టాల్లో పడతావు’’ అంటూ అందులో బెదిరింపులకు దిగాడు. దీంతో ఆ వ్యక్తి పంపిన బెదిరింపు మెసేజ్ లను స్క్రీన్ షాట్ తీసి పోస్ట్ చేసింది. ‘‘ఈ నెటిజన్కు గతంలో నా వయసు, పెళ్లి గురించి సమస్య ఉంది. ఇప్పుడు ఏకంగా నాకు చేతబడి చేసి.. యాసిడ్ పోయాలనుకుంటున్నాడు. నేనిప్పుడు ఫిర్యాదు చేయాలా..’’ అని రష్మి ప్రశ్నించింది. ప్రస్తుతం రష్మిపోస్ట్ వైరల్గా మారింది. కుక్కల పంచాయితీతో మొదలైన రష్మీ వివాదం ఇప్పటికే చిలికి చిలికి గాలి వాన కాగా ముందు ముందు మరే ఇతర సమస్యలకు దారి తీస్తుందో చూడాలి.