యాంకర్ రష్మీ(Rashmi)కి ఒక నెటిజన్ కోపం తెప్పించాడు. చేసేవన్నీ లంగా పనులు అంటూ ఆమెపై అసభ్యకరమైన కామెంట్స్ చేశాడు. దీంతో సహనాన్ని కోల్పోయిన రష్మీ అతనికి తన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. దీంతో రష్మీ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటటే.. జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం కన్నులపండుగగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు దేశం నలుమూలల నుండి ప్రముఖులు హాజరై.. ఆ బాలచంద్రుడిని దర్శించుకున్నారు.
ఇక యాంకర్ రష్మీ గౌతమ్ కూడా తన సోషల్ మీడియా వేదికగా శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమంపై స్పందించారు. నిజంగా ఇది మరపురాని రోజు. జనవరి 22న రెండవ దీపావళి జరుపుకోవాలి. శ్రీరాముడు, సీతా మాత తమ ఇంటికి తిరిగి వచ్చిన శుభ సందర్భం ఇది.. అంటూ ట్వీట్ చేశారు రష్మీ. రష్మీ చేసిన ఈ ట్వీట్ వైరల్ అవగా చాలా మంది రష్మీ చేసిన పోస్ట్ పై రియాక్ట్ అయ్యారు. వారికో ఒక నెటిజన్ మరీ అసభ్యంగా కామెంట్ చేశాడు.
We are not an nation that puts a ban on art forms or tv channels or shuts down theatres
— rashmi gautam (@rashmigautam27) January 24, 2024
People from neighbouring countries come here to pursue art forms freely https://t.co/gfuRkJCwLN
చేసేవన్నీ లంగా పనులు.. కానీ కాషాయ చీర కట్టుకుని జై శ్రీరామ్ అంటే అన్ని తుడిచిపెట్టుకుని పోతాయా? అంటూ అసభ్యంగా రాసుకొచ్చాడు. దానికి సహనం కోల్పోయిన రష్మీ.. నేను బిల్లులు కట్టకుండా లేదా ? నా తల్లి దండ్రులను రోడ్డున పడేశానా ? ట్యాక్సులు కట్టడంలేదా? ఇల్లీగల్ పనులేమైనా చేస్తున్నానా ? అసలు మీ దృష్టిలో లంగా పనులు అంటే ఏంటి? కాషాయ చీరలో రామ నామ స్మరణలో ఉన్న నన్నెందుకు రెచ్చగొడుతున్నారు? ధర్మాన్ని, కర్మని ఆధ్యాత్మికంగా బ్యాలెన్స్ చేయడమే సనాతన ధర్మం యొక్క గొప్పతనం.. అంటూ సాలిడ్ కౌంటర్ ఇచ్చారు. దీంతో ఆమెకు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు అందుతున్నాయి.