దేవునిపల్లి పీహెచ్సీలో ఎనీమియా ముక్త్ భారత్ కార్యక్రమంపై శిక్షణ

 దేవునిపల్లి పీహెచ్సీలో ఎనీమియా ముక్త్ భారత్ కార్యక్రమంపై శిక్షణ

కామారెడ్డిటౌన్, వెలుగు: ఎనీమియా ముక్త్ భారత్​కార్యక్రమంపై దేవునిపల్లి పీహెచ్​సీలో  గురువారం జిల్లాలోని ఫార్మసీ అధికారులకు శిక్షణనిచ్చారు. మాతాశిశు ఆరోగ్య అధికారి డాక్టర్ అనురాధ మాట్లాడుతూ.. రక్తహీనతతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యను అధిగమించేందుకు వారికి అవసరమైన మందుల సరఫరా కోసం ఈ శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. జిల్లా డ్రగ్స్​స్టోర్ ఇన్​చార్జి  దీప్తి తదితరులు పాల్గొన్నారు.