హైదరాబాద్, వెలుగు: అంగన్వాడీలకు ఇస్తున్న బీఎల్ఓ డ్యూటీలను రద్దు చేయాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) డిమాండ్ చేసింది. ప్రీ ప్రైమరీ, పీఎం శ్రీ కేంద్రాలను రద్దు చేసి వాటి బాధ్యతలను అంగన్వాడీ కేంద్రాలకే ఇవ్వాలని కోరింది. శుక్రవారం హైదరాబాద్ ప్రజాభవన్ ప్రజావాణిలో నోడల్ అధికారి విద్యాసాగర్, ఇన్చార్జి చిన్నారెడ్డిలకు నేతలు వినతిపత్రం ఇచ్చారు.
కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలన్నారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత, ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి నేతృత్వంలో జరిగిన చర్చల అనంతరం అధికారులు స్పందిస్తూ, అంగన్వాడీ సమస్యలపై చర్యలు తీసుకోవాలని ఐసీడీఎస్ డైరెక్టర్ శృతి ఓజాకు లేఖ రాసినట్లు తెలిపారు.
