ఉర్దూ పాఠాలు చెప్పిన స్కూల్ పై చర్యలు తీసుకోవాలి : బీజేపీ నేతలు

ఉర్దూ పాఠాలు చెప్పిన స్కూల్ పై చర్యలు తీసుకోవాలి : బీజేపీ నేతలు

ఆర్మూర్, వెలుగు: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్​లో ఉన్న భరత్ స్కూల్​ లో పర్మిషన్ లేకుండా ఉర్దూ బోధించిన ప్రిన్సిపాల్​అమీర్​ఖాన్​తోపాటు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్​ చేశారు. శుక్రవారం ఆర్మూర్​ డీఎస్పీ వెంకటేశ్వర్​ రెడ్డితోపాటు సబ్ కలెక్టర్​ అభిగ్యాన్​ మాల్వియాను వేర్వేరుగా కలిసి మెమోరాండం అందజేశారు.

బీజేపీ జిల్లా కార్యదర్శి పోల్కం వేణు మాట్లాడుతూ.. స్కూల్​లో నమాజ్​చదివించడం, నేర్పించడం చేసిన ప్రిన్సిపాల్​ను అరెస్ట్ ​చేయాలని, ఉర్ధూ పాఠాలు బోధిస్తున్న చర్య తీసుకోకుండా నిర్లక్ష్యం చేసిన ​ఎంఈవో పింజ రాజగంగారాంపైనా చర్యలు తీసుకోవాలని కోరారు.జెఅనిల్, పి.యుగంధర్, కె.ప్రశాంత్, ఉదయ్​గౌడ్, ద్యాగ ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.