రణబీర్ కపూర్ ‘యానిమల్’ చిత్రంతో త్రిప్తి డిమ్రి స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. తన గ్లామర్ షోతో యూత్ను అట్రాక్ట్ చేసిన ఆమె.. టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోంది. విజయ్ దేవరకొండకు జోడీగా ఆమె కనిపించనుందని తెలుస్తోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్గా శ్రీలీలను ఫిక్స్ చేస్తూ పూజా కార్యక్రమాలు కూడా జరిపారు.
అయితే ఈ ప్రాజెక్టు నుంచి శ్రీలీల తప్పుకుందని, ఆమె ప్లేస్లో త్రిప్తిని ఫైనల్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ‘సప్త సాగరాలు దాటి’ ఫేమ్ రుక్మిణీ వసంత్ కూడా ఈ సినిమాలో మరో హీరోయిన్గా నటించనుందట. విజయ్ నటిస్తోన్న 12వ చిత్రమిది. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ స్పై ఏజెంట్గా కనిపించనున్నాడట. సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.