హీరో నవదీప్ తో గొడవ.. స్పందించిన అంకిత

హీరో నవదీప్ తో గొడవ.. స్పందించిన అంకిత

లాహిరి లాహిరి లాహిరిలో(Lahiri Lahiri Lahirilo)’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది నటి అంకిత(Ankitha). ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా సింహాద్రి(Simhadri) ఆమెకు మంచి గుర్తింపునిచ్చింది. 2009లో ఉన్నట్టుండి ఆమె ఇండస్ట్రీకి దూరమైంది. తాజాగా ఈ విషయంపై అంకిత మాట్లాడింది. ‘బాలకృష్ణ(Balakrishna)తో నటించిన విజయేంద్రవర్మ(Vijayendravarma) సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నాను. ఆ సినిమా హిట్​ అయ్యుంటే కచ్చితంగా ఇండస్ట్రీలో ఉండేదాన్ని.

పరిశ్రమలో నాకు ఎవ్వరితోనూ గొడవల్లేవు. నవదీప్(Navadeep)​తో గొడవంటూ రూమర్లు వచ్చాయి. అందులో నిజం లేదు. ఒకే సారి ఎక్కువ సినిమాలు ఒప్పుకుని ఒత్తిడికి గురయ్యాను అందుకే గ్యాప్​ ఇవ్వాల్సి వచ్చింది’ అంటూ తెలిపింది. 2019లో విశాల్ జగపతి(Jagapathi) అనే బిజినెస్​ మ్యాన్​ను పెళ్లిచేసుకున్న అంకిత ఇప్పుడు అమెరికాలో ఉంటోంది. వీరికి ఇద్దరు అబ్బాయిలు. త్వరలోనే టాలీవుడ్​లో కంబ్యాక్​ ఇస్తానని తెలిపింది.