హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ పాపిరెడ్డి వెల్లడి
రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిధిలో జరుగుతున్న రెగ్యులర్, సప్లిమెంటరీ ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి ప్రకటించారు. త్వరలోనే రీషెడ్యూల్ రిలీజ్ చేస్తామన్నారు. బుధవారం నుంచి స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లు, గురుకులాలు మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించగా.. ఎగ్జామ్స్ మాత్రం కొనసాగిస్తామని అన్ని యూనివర్సిటీలు చెప్పిన విషయం తెలిసిందే. వర్సిటీల ప్రకటనపై సీఎం కేసీఆర్ సీరియస్ అయినట్టు తెలిసింది.వెంటనే ఎగ్జామ్స్ వాయిదా వేయాలని ఉన్నతాధికారులను ఆయన ఆదేశించినట్టు సమాచారం. దీంతో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారం డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏతో పాటు డిస్టెన్స్ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్ అన్నీ వాయిదా వేస్తున్నట్లు పాపిరెడ్డి తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 24,25 తేదీల్లో పలు వర్సిటీల సెమిస్టర్లు ప్రారంభమై, వచ్చే నెల 15 వరకు ఉన్నాయి. సర్కారు ఆదేశాలతో ఎగ్జామ్స్ను వాయిదా వేస్తున్నట్టు వర్సిటీలు బుధవారం ప్రకటించాయి.
కాలేజీలు తెరిస్తే కఠిన చర్యలు: ఉమర్ జలీల్
ఇంటర్ కాలేజీలను ఓపెన్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు సెక్రెటరీ ఉమర్ జలీల్ హెచ్చరించారు. సర్కారు ఆదేశాలు పాటించపోతే కాలేజీల గుర్తింపు రద్దు చేస్తామన్నారు.