ఔటర్పై మరో ఇంటర్ చేంజ్ అందుబాటులోకి

ఔటర్పై మరో ఇంటర్ చేంజ్ అందుబాటులోకి

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పైన మరొక ఇంటర్ చేంజ్ అందుబాటులోకి రానున్నది. నార్సింగి వద్ద రూ.29.50 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇంటర్ చేంజ్ ను జూలై 1వ తేదీ శనివారం ఉదయం పది గంటలకు పురపాలక శాఖ మంత్రి కేటీర్ ప్రారంభించనున్నారు. 

నార్సింగి ఇంటర్ చేంజ్ నిర్మాణం వల్ల నార్సింగి, మంచిరేవుల, గండిపేట్ ప్రాంతాల ప్రయాణికులతో పాటు లంగర్ హౌస్, శంకర్ పల్లి ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు ఓఆఅర్ఆర్ మీదుగా వారి గమ్యస్థానానికి చేరుకోవడానికి ఎంతో సులువు అవుతుంది.