
న్యూఢిల్లీ: ఐటీసీ హోటల్ హైదరాబాద్లో మరో హోటల్ను నిర్మించనుంది. శంకర్పల్లిలో రాబోయే ఈ హోటల్లో155- గదులు ఉంటాయి. దీనిని ప్రారంభించడానికి కేఏసీ పామ్ ఎక్సోటికా హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఐటీసీ హోటల్స్ మంగళవారం ప్రకటించింది.
ఈ ఒప్పందంతో 'వెల్కమ్ హోటల్' బ్రాండ్ తెలంగాణలోకి అడుగుపెట్టనుంది. ఐటీసీ హోటల్స్ హైదరాబాద్లో ఇది వరకే రెండు హోటళ్లు.. ఐటీసీ కాకతీయ, ఐటీసీ కోహినూర్లను నిర్వహిస్తోంది.