ఇంకో లక్ష డోసులొచ్చినయ్

ఇంకో లక్ష డోసులొచ్చినయ్

స్టోరేజ్‌లో 7.73 లక్షల కొవిడ్ టీకాలు
అయినా వ్యాక్సినేషన్‌ రీస్టార్ట్​పై క్లారిటీ ఇవ్వని సర్కారు

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రానికి గురువారం మరో లక్ష కొవిడ్ వ్యాక్సిన్ డోసులు వచ్చాయి. వీటితో కలిపి మొత్తం 7.73 లక్షల డోసులు స్టోరేజ్ సెంటర్‌‌లో ఉన్నాయి. అయినప్పటికీ, రాష్ట్ర  సర్కార్ వ్యాక్సినేషన్‌ ఎప్పుడు రీస్టార్ట్ చేస్తుందనే దానిపై ఏ నిర్ణయం తీసుకోలేదు. ఈ నెల 14 నుంచి వారం రోజులుగా రాష్ట్రంలో వ్యాక్సినేషన్ బంద్ అయింది. మళ్లీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారో కూడా స్పష్టతను ఇవ్వడం లేదు. ఇప్పటికే కొవాగ్జిన్ రెండో డోసు గడువు ముగిసి, చాలా మంది జనాలు ఆందోళన చెందుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని కొన్ని ప్రైవేట్ హాస్పిటళ్లు మాత్రం శుక్రవారం నుంచి వ్యాక్సినేషన్ నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. అపోలో,  గ్లోబల్, సిటిజెన్స్‌, కిమ్స్‌ సహా పలు హాస్పిటళ్లు కరోనా వ్యాక్సినేషన్ చేస్తామని ప్రకటించాయి. కొవిన్ పోర్టల్‌లో స్లాట్ బుకింగ్‌ చేసుకుని, ఆ టైమ్‌కు వ్యాక్సినేషన్ సెంటర్‌‌కు రావాలని కోరాయి.