పద్మారావునగర్, వెలుగు: గాంధీ ఆస్పత్రిలోని స్టేట్ ఎబోలా ఐసోలేషన్ సెంటర్లో చికిత్స పొందుతున్న మరో సూడాన్వాసికి కూడా ఎబోలా నెగెటివ్వచ్చిందని సెంటర్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ వంశీకృష్ణ శనివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఎబోలా లక్షణాలతో రెండు రోజుల క్రితం ఐసోలేషన్ సెంటర్లో చేరిన అబ్దుల్ రఫీ మహమ్మద్ఆదమ్ ఇస్సా అనే యువకుడికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో వైరస్లేదని తేలిందన్నారు. ఇదివరకే ఒకరికి నెగెటివ్వచ్చిందని, మరోసారి ఈ ఇద్దరికీ వైద్య పరీక్షలు చేసి, నెగిటివ్ వస్తే డిశ్చార్జి చేస్తామని పేర్కొన్నారు.
