నాలాలో పడి మరో పసిప్రాణం బలి

నాలాలో పడి మరో పసిప్రాణం బలి

సికింద్రాబాద్ బోయినపల్లిలో విషాదం జరిగింది. చిన్నతోకట్ట నాలాలో పడి ఆనంద్ అనే ఏడేళ్ల బాలుడు చనిపోయాడు.  ఇంటిముందు ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ కాలుజారి నాలాలో పడిపోయాడు. గమనించిన స్థానికులు అధికారులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న డిజాస్టర్ టీం.. బాలుడి కోసం మూడు గంటలు శ్రమించినా ఫలితం లేకపోయింది. బాలుడు పడిపోయిన కొద్దిదూరంలోనే రెస్క్యూ టీం సభ్యులు బాలుడి డెడ్ బాడీని గుర్తించారు. నాలాకు రక్షణ గోడ లేకపోవడంతోనే బాబు చనిపోయాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. 

గతేడాది కూడా సుమేధా అనే చిన్నారి నాలాలో పడి చనిపోయింది. ఆ చిన్నారి మృతికి మున్సిపల్ మంత్రి కేటీఆర్ కారణమంటూ సుమేధా తల్లి కేసు కూడా పెట్టింది. అయినా కూడా నాలాల చుట్టూ రక్షణ వలయాలు ఏర్పాటు చేయకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.