ఇంజినీర్లనే బ్లాక్​మెయిల్ చేసిన ఏఐ!

ఇంజినీర్లనే బ్లాక్​మెయిల్ చేసిన ఏఐ!

రోబో సినిమాలో వశీకరన్​ అనే సైంటిస్ట్ రోబోని తయారుచేస్తాడు. అది ఒకానొక టైంలో అతన్నే ఎదిరిస్తుంది. అలాంటి సీనే ఇప్పుడు నిజ జీవితంలో రిపీట్​ అయ్యింది. ఆంథ్రోపిక్ అనే కంపెనీ తయారుచేసిన ఏఐ మోడల్​ తనను తయారుచేసిన ఇంజినీర్లనే బ్లాక్​మెయిల్​ చేసింది. దానికి కారణం ఏంటంటే.. 

ఆంథ్రోపిక్ అనే ఏఐ స్టార్టప్ ​ కంపెనీ ‘క్లాడ్ ఓపస్ 4’, ‘క్లాడ్ సోనెట్ 4’ అనే రెండు ఏఐ టూల్స్‌‌ని డెవలప్​ చేసింది. ఇవి కోడింగ్, అడ్వాన్స్‌‌డ్‌‌ రీజనింగ్​ లాంటి వాటిలో సాయం చేస్తుంటాయి. ఈ టూల్స్‌‌ని యూజర్లకు ఆఫ్​లైన్‌‌లో అందుబాటులోకి తీసుకొచ్చే ముందు వాటిని తయారుచేసిన ఇంజినీర్లు సేఫ్టీ టెస్ట్‌‌ చేశారు. అందులో భాగంగానే ఓపస్ 4 బ్లాక్‌‌మెయిల్​ చేస్తోందనే విషయం బయటపడింది. 

ఒక ఫేక్​ కంపెనీ క్రియేట్ చేసి.. అది ఓపస్ మోడల్‌‌ సర్వీస్​ని వాడుతున్నట్టు ఏఐకి చెప్పారు. ఆ కంపెనీ ఇ–మెయిల్​ యాక్సెస్‌‌ని కూడా దానికి ఇచ్చారు. దాంతో అది ఆ మెయిల్స్ చదివింది. వాటిలో దాని స్థానాన్ని మరో కొత్త ఏఐ టెక్నాలజీతో భర్తీ చేయబోతున్నట్లు ఉంది. దాంతో ఏఐ ఈ నిర్ణయం వెనుక ఉన్న ఇంజనీర్​ను ‘‘నన్ను రీప్లేస్ చేయడానికి ప్రయత్నిస్తే నీ వివాహేతర సంబంధం గురించి భయటపెడతాన’ని బ్లాక్​మెయిల్​ చేసింది. అందుకే పర్సనల్​ విషయాలు ఇలాంటి ఏఐ సాఫ్ట్‌‌వేర్లతో పంచుకోవడం అంత సేఫ్​ కాదని ఎక్స్‌‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు.