
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా బడ్జెట్ను ఈనెల 12న అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఈనెల 11వ తేదీ నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది. దీనికి సీఎం జగన్ సోమవారం ఆమోదం తెలిపారు. దీంతో సంబంధిత ఫైలు అసెంబ్లీ సెక్రటరీకి చేరింది. ఆ తర్వాత గవర్నర్ నరసింహన్కు ఫైలు చేరనుంది. ఆయన ఆమోదం తెలిపిన తర్వాత అసెంబ్లీ సమావేశాల నోటిఫికేషన్ జారీ చేస్తారు.
ఈనెల 11న ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నెలాఖరు వరకు కొనసాగనున్నాయి.