ఆశావర్కర్ల జీతాలు 10 వేలకు పెంచిన జగన్

ఆశావర్కర్ల జీతాలు 10 వేలకు పెంచిన జగన్

ఆంధ్రప్రదేశ్ లోని ఆశావర్కర్లకు గుడ్ న్యూస్ చెప్పారు AP CM వైఎస్ జగన్. పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ వారి జీతాలను భారీగా పెంచారు. ఆశావర్కర్ల జీతాలను పదివేల రూపాయలకు పెంచుతున్నట్టు జగన్ ప్రకటించారు. వైద్యఆరోగ్య శాఖపై తాడేపల్లిలోని సీఎం క్యాంప్  కార్యాలయంలో సమీక్ష చేపట్టిన వైఎస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి నిర్ణయంతో ప్రస్తుతం మూడు వేల వేతనం అందుకుంటున్న ఆశావర్కర్లు.. ఇకపై పదివేలు అందుకోనున్నారు.

మరోవైపు రెండు గంటలపాటు సాగిన వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పేదవారికి మెరుగైన వైద్యం అందించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వైద్య, ఆరోగ్య శాఖలో అవినీతిని సహించేది లేదని, వైద్యశాఖను తానే ప్రత్యక్షంగా పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. అధికారులు అంతా బాధ్యతతో పనిచేసి వైద్యశాఖపై 45 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు జగన్.