అన్నింటా చంద్రబాబు అవినీతే: జగన్

అన్నింటా చంద్రబాబు అవినీతే: జగన్

కర్నూల్ జిల్లాలోని ఎమ్మిగనూరులో జగనన్న చెదోడు పథకం విడుదల కార్యక్రమరంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా  జగనన్న చెదోడు పథకం నాలుగో ఏడాది సిఎం జగన్ నిధులను విడుదల చేశారు.  అనంతరం సిఎం జగన్ మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాల జీవన ప్రయాణంలో తోడుగా ఉన్నామాని.. వెనుకబడిన వర్గాలను వెన్నెముక కులాలుగా మార్చుతామన్నారు. ఇచ్చిన మాటను 52 నెలల పాలనలో నిలబెట్టుకున్నామని తెలిపారు. చంద్రబాబు ద్వారా నష్టపోయిన పొదుపు సంఘాలకు.. మీ బిడ్డగా అనేక పథకాలతో తోడుగా ఉన్నానని తెలిపారు.

రాజధాని భూముల నుంచి స్కిల్ డెవలప్ మెంట్ వరకు.. అన్నింటా చంద్రబాబు పాలనలో దోచుకోవడమే జరిగింది. పేదలకు ఒక్క సెంటు స్థలం కూడా చంద్రబాబు ఇవ్వలేదని విమర్శించారు. మీ బిడ్డ ముఖ్యమంత్రి అయి 31 లక్షల ఇంటి స్థలాలు అందించడం జరిగిందన్నారు. పొదుపు సంఘాలను చంద్రబాబు మోసం చేశారని చెప్పారు. గతంలో ఏ పౌర సేవ కావాలన్నా.. జన్మభూవి కమిటీల చుట్టూ తిరుగాల్సిన పరిస్థితి ఉండేదని.. కానీ, మీ బిడ్డ ప్రభుత్వంలో మీ ఇంటి వద్దకే పౌర సేవలు వస్తున్నాయని సిఎం పేర్కొన్నారు.

Also Read :- ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో అజరుద్దీన్ పై కేసు నమోదు

కాగా, నాలుగేళ్లలో జగనన్న చేదోడు పథకం కింద రూ.1252.52 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఈ పథకం కింద రజకులు, నాయూ బ్రాహ్మణులు, దర్జీలు రూ.10వేల ఆర్థిక సాయాన్ని పొందుతున్నారు.