
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు శ్రీశైలం సందర్శించే అవకాశం ఉంది. ఈ మేరకు సంబంధిత ఇరిగేషన్.. కర్నూలు జిల్లా అధికారులకు సమాచారం అందింది. రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి అవంతి శ్రీనివాస్ టూరిజం పాలసీ గురించి చర్చించిన సందర్భంగా శ్రీశైలం డ్యామ్ కు వరద పోటెత్తుతోందన్న అంశం ప్రస్తావనకు వచ్చింది.. మరో రెండు గేట్లు అంటే.. 7 గేట్లు ఎత్తుతున్నట్లు .. ఈ నేపధ్యంలో సీఎం జగన్ కూడా రేపు ఉదయం శ్రీశైలం వెళ్లనున్నట్లు సమాచారం అందింది. రేపు ఉదయం ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి శ్రీశైలం వెళ్లనున్న వైఎస్ జగన్ డ్యామ్ ను సందర్శించే అవకాశ ఉంది. అక్కడే ఇరిగేషన్ అధికారులతో ఎస్ జగన్ సమీక్షించే అవకాశం ఉంది. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు.. టెండర్ల ప్రక్రియ… తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాలు.. తదితర అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి జగన్ చర్చించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.