ఏపీలో కరోనావైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. తాజాగా 7,895 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. దాంతో మొత్తం పాజిటివ్ కేసులు 3,53,111కు చేరాయి. గత 24 గంటల్లో కరోనా బారినపడి 93 మంది చనిపోయారు. దాంతో ఇప్పటివరకు ఏపీలో కరోనా వల్ల చనిపోయిన వారిసంఖ్య 3,282కు చేరింది. ప్రస్తుతం ఏపీలో 89,742 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,60,087గా నమోదయింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 32,38,038 కరోనా టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కరోనా వల్ల నెల్లూరులో 16 మంది, పశ్చిమ గోదావరిలో 13 మంది, చిత్తూరులో 11మంది, కర్పూల్ లో 10మంది, ప్రకాశంలో 9మంది, కడపలో 8మంది, శ్రీకాకుళంలో ఆరుగురు, విశాఖపట్నంలో అయిదుగురు, తూర్పు గోదావరిలో నలుగురు, అనంతపూర్ లో ముగ్గురు, గుంటూరులో ముగ్గురు, కృష్ణాలో ముగ్గురు, మరియు విజయనగరంలో ఇద్దరు మరణించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.
For More News..