కేసీఆర్ కంటే కిరణ్ కుమార్ రెడ్డి వెయ్యి రెట్లు బెటర్

కేసీఆర్ కంటే కిరణ్ కుమార్ రెడ్డి వెయ్యి రెట్లు బెటర్

సీఎం కెసిఆర్ తో పోల్చితే సమైక్యాంధ్ర నాయకులు బెటర్ అన్నారు  ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. గతంలో పరిపాలించిన కిరణ్ కుమార్ రెడ్డి కేసీఆర్ కంటే వెయ్యి రేట్లు నయమన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక డిపో దగ్గర ఆర్టీసీ కార్మికుల నిరసనకు మందకృష్ణ సంఘీభావం ప్రకటించారు.బీజేపీ లీడర్ రఘునందన్ రావుతో కలిసి కార్మికులకు బియ్యం బస్తాలను పంపిణీ చేశారు ప్రజలను తక్కువ చేసి మాట్లాడితే ప్రభుత్వాన్ని గద్దె దింపే సత్తా ప్రజలకుందన్నారు.

కేసీఆర్ ప్రభుత్వాన్ని బోనుల నిలబెట్టిన ఘనత ఆర్టీసీ కార్మికులకే దక్కిందన్నారు మందకృష్ణ. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఆర్టీసీ ఆస్తులు అమ్మేందుకు కార్మికులు అడ్డుపడుతున్నందునే సెల్ఫ్ డిస్మిస్ అంటున్నారని విమర్శించారు.తప్పకుండా కార్మికులు విజయం సాధిస్తారన్నారు.