
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. త్వరలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతోంది. జూలై 24వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ధియేటర్లలో సందడి చేయబోతుంది ఈ మూవీ. దీనికి సంబంధించి.. హరిహర వీర మల్లు మూవీకి సంబంధించి.. ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం. టికెట్ల రేట్లు పెంచుకోవటానికి అవకాశం కల్పిస్తూ జీవో రిలీజ్ చేసింది చంద్రబాబు సర్కార్. సినిమా మొదలైన నాటి నుండి పలుమార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు టికెట్ రేట్లు పెంపు అన్నది ఫ్యాన్స్ కి పండగ లాంటి వార్త అని చెప్పాలి.
సినిమా రిలీజ్ అయ్యే ముందురోజు రాత్రి వేసే ప్రీమియర్ షోలకు టికెట్ రేట్లు డిసైడ్ చేసింది సినిమా యూనిట్. ప్రీమియర్ షోలకు గాను ఒక్కో టికెట్ రూ. 600గా డిసైడ్ చేసింది సినిమా యూనిట్. దీనిపై జీఎస్టీ అదనం అని స్పష్టం చేసింది ఏపీ సర్కార్. అంతే కాకుండా సినిమా రిలీజైన రోజు నుండి పదిరోజుల వరకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిచ్చింది ప్రభుత్వం. జులై 24 నుంచి ఆగస్టు 2 వరకు 10 రోజుల దాకా అన్ని థియేటర్లకు పెంచిన ధరలు వర్తిస్తాయని తెలిపింది ప్రభుత్వం.
ALSO READ : చిరంజీవి, నయనతార 'MEGA157' సాంగ్ లీక్.. చిత్ర యూనిట్ హెచ్చరిక!
లోయర్ క్లాస్ టికెట్లు రూ. 100, అప్పర్ క్లాస్ టికెట్లు రూ. 150 వరకు, ముల్టీప్లెక్స్ టికెట్లు రూ. 200 వరకు వసూలు చేసుకునేందుకు అనుమతిస్తూ జీవో విడుదల చేసింది ప్రభుత్వం. దీని ప్రకారం ఏపీలో సింగిల్ స్క్రీన్ గరిష్ట టికెట్ ధర 230 నుంచి మల్టిప్లెక్స్ కి 295 వరకు ఉండే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో అంచనాలు పీక్స్ కి చేరాయి.
పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. నిర్మాత ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు.కాగా.. షూటింగ్ మొదలైన ఐదేళ్ల పాటు పలు మార్లు వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సహనాన్ని పరీక్షించింది.
ఒకానొక సమయంలో సినిమా అటకెక్కింది అన్న పుకార్లు కూడా వచ్చాయి. ఎట్టకేలకు హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి చేసుకొని బాక్సాఫీస్ ముందుకు రావడంతో ఫ్యాన్స్ కుదుటపడ్డారు. ఇప్పుడు టికెట్ రేట్ల పెంపునకు ఏపీ సర్కార్ అనుమతించడంతో ఫ్యాన్స్ ఆనందం రెట్టింపయ్యిందనే చెప్పాలి. మరి, ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నట్లుగా ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ కి పాన్ ఇండియా హిట్ దక్కుతుందా లేదా అన్నది వేచి చూడాలి.