చంద్రబాబుకు జగన్ సర్కార్ భారీ షాక్

చంద్రబాబుకు జగన్ సర్కార్ భారీ షాక్
  • కరకట్టపై ఉన్న గెస్ట్ హౌస్ ని అటాచ్ చేసిన ఏపీ ప్రభుత్వం

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు  చెందిన  గెస్ట్ హౌస్(కరకట్ట)ని ఏపీ గవర్నమెంట్ అటాచ్ చేసింది. క్రిమినల్ లా అమెండ్ మెంట్ 1944 చట్టం ప్రకారం ప్రాపర్టీని అటాచ్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, నారాయణ తమ పదవులను దుర్వినియోగపరిచి క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారన్న కేసుల విచారణ నేపథ్యంలో అధికారులు చర్యలు తీసుకున్నారు. కరకట్టపై ఉన్న లింగమనేని గెస్ట్ హౌస్ అక్రమంగా పొందారని చంద్రబాబుపై అభియోగాలున్నాయి. చట్టాలను ఉల్లంఘించారని విచారణలో తేలింది. 

బంధువులకు ప్రయోజనాలు కలిపించారని ఆరోపణలు..

అధికారంలో ఉన్నప్పుడు పదవులను ఉపయోగించుకుని బంధువులు, సన్నిహితులకు ప్రయోజనాలు కల్పించారనే అభియోగాలు చంద్రబాబుపై ఉన్నాయి. ఈ క్రమంలో గెస్ట్ హౌజ్ ని అటాచ్ చేయాలని ప్రభుత్వాన్ని సీఐడీ కోరడంతో, ప్రభుత్వం చర్యలు తీసుకుంది. జడ్జీకి సమాచారం ఇచ్చి లింగమనేని గెస్ట్ హౌస్ని అటాచ్ చేసింది. ఈ పరిణామంతో టీడీపీ శ్రేణులు షాక్ తిన్నాయి.  లింగమనేనిపైనే కాకుండా అక్రమాలకు పాల్పడిన వారందరిపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు.