కృష్ణా బోర్డుకు ఏపీ సర్కార్ లెటర్

కృష్ణా బోర్డుకు ఏపీ సర్కార్ లెటర్

కృష్ణాలో మరో 77 టీఎంసీలు ఇవ్వాలంటూ కృష్ణా బోర్డుకు లెటర్ రాసింది ఏపీ సర్కార్. పోతిరెడ్డిపాడుకు 66 టీఎంసీలు, హంద్రినీవాకు 5 టీఎంసీలు కేటాయించాలని బోర్డును కోరింది. ఆగస్ట్, సెప్టెంబర్ నెలలకు ఈ నీటిని ఇవ్వాలని బోర్డును కోరారు. గతంలో.. పోతిరెడ్డిపాడుకు 9టీఎంసీలు, హంద్రినీవాకు 8టీఎంసీలు బోర్డ్ కేటాయించారు. వీటికి అదనంగా మరో 71 టీఎంసీలు ఇవ్వాలంటూ ఏపీ తాజాగా కృష్ణా బోర్డుకు లేఖ రాసింది.