పంట నష్టపోయిన రైతులకు రూ.1,277 కోట్లు చెల్లింపు

పంట నష్టపోయిన రైతులకు రూ.1,277 కోట్లు చెల్లింపు

అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించే ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి చేసింది. ఇందుకోసం ప్రభుత్వం ఇటీవల రూ.1,277 కోట్లను కేటాయించింది.

ధాన్యం నష్టపోయిన 32,558 మంది రైతుల ఖాతాలకు మే 10 న రూ.474 కోట్లు జమ చేసినట్లు ఏపీ ఉన్నతాధికారులు తెలిపారు. దీంతో గత అయిదు రోజులుగా రైతులకు జమ చేస్తున్న నగదు బదిలీ ప్రక్రియ పూర్తయింది. రికార్డు సమయంలో పంట నష్ట పరిహారం అందించామని అధికారులు చెబుతున్నారు.