- శ్రీశైలం నీళ్లన్నీ బేసిన్ అవతలికి తరలించేలా పనులు
- పవర్హౌస్లపై మరోసారి సుప్రీం తలుపుతట్టిన ఏపీ
హైదరాబాద్, వెలుగు: కృష్ణానది నీళ్లను రాయలసీమకు మళ్లించుకునే పనులను ఏపీ స్పీడప్ చేసింది. ఎలాంటి పర్మిషన్లు లేకున్నా.. అక్రమ ప్రాజెక్టులను స్పీడ్గా పూర్తి చేస్తున్నది. ఇప్పటికే సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్స్కీం పనులను దాదాపు కంప్లీట్ చేసిన ఏపీ సర్కారు.. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ నుంచి రోజుకు ఏడు టీఎంసీలను తరలించుకునేలా శ్రీశైలం రైట్మెయిన్కెనాల్(ఎస్ఆర్ఎంసీ) సిమెంట్ లైనింగ్పనులు చేస్తున్నది. తద్వారా శ్రీశైలం నీళ్లను రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు యథేచ్ఛగా మళ్లించుకునే ప్రయత్నాలు చేస్తున్నది.
రాయలసీమలోని కర్నూల్మాత్రమే కృష్ణా బేసిన్పరిధిలోకి వస్తుంది. మిగతా జిల్లాలు బేసిన్అవతలివి. ఇప్పటికే ఆయా జిల్లాల్లో 326 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు నిర్మించుకున్న ఏపీ.. వాటికి జలభద్రత కల్పించేలా శ్రీశైలం నీటిని మళ్లించుకునే పనులు చేస్తున్నది. దీనికితోడు తెలంగాణ హైడల్పవర్ను కట్టడి చేసే కుట్రలకు తెరతీసింది. ఇప్పటికే శ్రీశైలం, నాగార్జున సాగర్లో టీఎస్జెన్కో పవర్జనరేషన్ చేయకుండా కట్టడి చేయాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం.. ఇప్పుడు పవర్హౌస్లను కేఆర్ఎంబీకి అప్పగించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్దాఖలు చేసింది.
శ్రీశైలం నుంచి రోజుకు మూడు టీఎంసీలు లిఫ్ట్చేసేలా సంగమేశ్వరం (రాయలసీమ) ఎత్తిపోతల స్కీంకు 2020 మే 5న ఏపీ రూ.6,829.15 కోట్లతో పరిపాలన అనుమతులు ఇచ్చింది. ఇదీ పూర్తిగా కొత్త స్కీం. కొత్త ప్రాజెక్టు ప్రారంభించాలంటే కేఆర్ఎంబీతో పాటు అపెక్స్కౌన్సిల్అనుమతి తప్పనిసరి. అయితే దీనికి ఎలాంటి అనుమతులు రాలేదు. పనులు చేపట్టొద్దని ఎన్జీటీ స్టే కూడా ఇచ్చింది అయినా ఏపీ ప్రభుత్వం రాత్రి పూట ఫ్లడ్లైట్లు పెట్టి పనులు చేస్తున్నది.
శ్రీశైలంలో 854 అడుగులకు నీటిమట్టం చేరితే తప్ప పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తీసుకోలేమని ఏపీ చెస్తున్నప్పటికీ అది నిజం కాదు. రిజర్వాయర్లో 841 అడుగులకు నీటిమట్టం చేరితే పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తీసుకోవచ్చు. ఆ విషయాన్ని ఏపీ తొక్కిపెడుతూ.. రిజర్వాయర్లో 854 అడుగులకు నీటిమట్టం చేరే వరకు టీఎస్జెన్కో.. శ్రీశైలం లెఫ్ట్బ్యాంక్పవర్హౌస్ నుంచి కరెంట్ ఉత్పత్తి చేయకుండా అడ్డుకోవాలని కోర్టును ఆశ్రయించింది. అయితే శ్రీశైలం నిర్మించిందే హైడల్పవర్జనరేషన్కోసం.. ఆ స్ఫూర్తిని ఏపీ ప్రభుత్వం తుంగలో తొక్కుతూ ఆ రిజర్వాయర్లో నీళ్లన్ని దోపిడీ చేసేలా పనులు చేసుకుపోతున్నది.
ఎస్ఆర్ఎంసీ నుంచే రోజుకు 7 టీఎంసీలు..
చెన్నై తాగునీరు, రాయలసీమ సాగునీటి అవసరాల పేరుతో శ్రీశైలం ప్రాజెక్టుపై పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ నిర్మించారు. దీని ద్వారా రోజు 1,500 క్యూసెక్కులు డ్రా చేయడానికి అనుమతులు ఉన్నాయి. చెన్నై తాగునీటికి 15 టీఎంసీలు, ఎస్ఆర్ఎంసీకి 19 టీఎంసీలు తీసుకోవడానికి పర్మిషన్ఉంది. అయితే అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం రోజుకు 11,150 క్యూసెక్కులు (ఒక టీఎంసీ) తరలించేలా దాన్ని డిజైన్చేశారు. వైఎస్సీఎం అయ్యాక 44 వేల క్యూసెక్కులు తరలించేలా ఇంకో పది గేట్లతో కొత్త హెడ్రెగ్యులేటర్నిర్మించారు.
కొత్త రెగ్యులేటర్ఆపరేషన్లోకి రాగానే పాత హెడ్రెగ్యులేటర్మూసేస్తామని అప్పట్లో హామీ ఇచ్చినా.. రెండు హెడ్రెగ్యులేటర్లు అలాగే ఉన్నాయి. ఎస్ఆర్ఎంసీ నుంచి ప్రస్తుతం 44 వేల క్యూసెక్కులు (రోజుకు 4 టీఎంసీలు) తరలించే అవకాశం ఉండగా, దానికి సిమెంట్లైనింగ్చేసి రోజుకు ఏడు టీఎంసీలకు పైగా తరలించేలా డెవలప్ చేస్తున్నారు. లైనింగ్పనులు పూర్తయితే పది రోజుల్లోనే ఎస్ఆర్ఎంసీ నుంచి 70 టీఎంసీలు తీసుకునే చాన్స్ ఉంది. దీనికి తోడు హెచ్ఎన్ఎస్ఎస్, ముచ్చుమర్రి లిఫ్ట్స్కీంలు, వెలిగొండ టన్నెల్ప్రాజెక్టు ద్వారా ఏపీ ఇంకో రెండు టీఎంసీలకు పైగా మళ్లించుకునే పనులు పూర్తి చేసింది.