
ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు హైకోర్టులో ఊరట లభించింది. మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. ఐఆర్ఆర్, లిక్కర్ కేసు,ఇసుక కేసుల్లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ వచ్చింది. కేసుల గురించి మీడియాతో మాట్లాడొద్దని హైకోర్టు ఆదేశించింది.
చంద్రబాబు ఇప్పటికే స్కిల్ స్కాం కేసులో అరెస్టయి బెయిల్ పై బయటకొచ్చారు. లిక్కర్ స్కాం కేసులో టీడీపీ నేత కొల్లు రవీందరకు కూడా హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది.
ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇసుక, లిక్కర్ వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయంటూ ఏపీ సీఐడీ చంద్రబాబుపై కేసులు నమోదు చేసింది. వీటిపై ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.