
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షా ఫలితాలను ఇవాళ (మంగళవారం) ఆ రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. 13 శాఖల్లో మిగిలిపోయిన 16,208 పోస్టుల భర్తీకి గాను గత నెల 20 నుంచి 26వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. 19 రకాల పోస్టుల కోసం 14 రకాల పరీక్షలు జరిపారు. దాదాపు 7.69 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుయ్యారు. రికార్డు సమయంలో OMR ఆన్సర్ షీట్లను స్కాన్ చేశారు. 7,68,965 మంది అభ్యర్థుల OMR ఆన్సర్ షీట్లను గత నెల 21 నుంచి 27వ తేదీ వరకు అధికారులు స్కాన్ చేశారు. ఆ ఫలితాలను ఆ రంగంలో నిష్ణాతులైన గణాంకాల బృందం ద్వారా మరోసారి పరిశీలించి.. మంగళవారం ఫైనల్ ఫలితాలను విడుదల చేశారు.