వారిద్దరూ కలిసినా వచ్చేది సున్నానే: మంత్రి అంబటి

వారిద్దరూ కలిసినా వచ్చేది సున్నానే: మంత్రి అంబటి

నారా బ్రాహ్మణి పై మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఎటాక్ చేశారు. తన తాతను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని తెలియదా అని అన్నారు. మరోవైపు టీడీపీ-జనసేన పొత్తుపై మాట్లాడుతూ... ఆ రెండు పార్టీలు కలిసి పోటీచేస్తే ఏమవుతుంది..  రెండు అంకెలు కలిస్తే కొత్త అంకె వస్తుందన్నారు. రెండు సున్నాలు కలిస్తే సున్నానే వస్తుందని తెలిపారు. పవన్ కళ్యాణ్ కు రాజకీయంగా, వ్యక్తిగతంగా నైతిక విలువలు లేవని దుయ్యబట్టారు.

 టీడీపీ, జనసేన పొత్తును  జనసేన కార్యకర్తలే అంగీకరించటం లేదని విమర్శించారు. చంద్రబాబు కాళ్ళు పిసకమంటే జన సైనికులు, వీర మహిళలు సిద్ధంగా లేరని తెలిపారు. జనసేన, టీడీపీ కలిసి వచ్చినా మళ్ళీ అధికారంలోకి వచ్చేది వైసీపీనేనని ధీమా వ్యక్తం చేశారు.