న్యూఢిల్లీ: యాపిల్ డిసెంబర్ క్వార్టర్లో ఇండియాలో తన వ్యాపారాలను రెండింతలు పెంచుకుంది. తన ఆన్లైన్ స్టోర్ మంచి పర్ఫార్మెన్స్ రికార్డు చేయడంతో గ్రోత్ బాటలో ముందుకు వెళ్తున్నట్టు యాపిల్ సీఈవో టిమ్ కుక్ చెప్పారు. డిసెంబర్తో ముగిసిన క్వార్టర్లో ఈ టెక్ కంపెనీ ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో 111.4 బిలియన్ డాలర్ల రెవెన్యూను గ్లోబల్గా ఆర్జించింది. ఇయర్ ఆన్ ఇయర్ ఇది 21 శాతం ఎక్కువ. ఇంటర్నేషనల్ సేల్స్ ఈ క్వార్టర్ రెవెన్యూలో 64 శాతంగా ఉన్నాయి. ఇండియాను తీసుకుంటే వ్యాపారాలు రెండింతలు పెరిగినప్పటికీ అవకాశాలతో పోల్చుకుంటే.. ఇంకా తక్కువగానే వ్యాపారాలున్నాయన్నారు.