తెలుగు ప్రతిభావంతుల పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానం

తెలుగు ప్రతిభావంతుల పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానం

బషీర్ బాగ్, వెలుగు:  స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వివిధ విభాగాల్లో ప్రతిభావంతులకు  పురస్కారాలు అందించేందుకు  ప్రముఖ సాంస్కృతిక, సామాజిక సేవా సంస్థ ‘అర్పిత ’ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంస్థ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు గణగళ్ల విజయ్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్య, వైద్యం, విధి నిర్వహణ, సమాజ సేవ, నృత్యం, కళ, క్రీడ, సాహిత్యం, చిత్రలేఖనం, పర్యావరణ పరిరక్షణ, శాస్త్రీయ సంగీతం (నాదస్వరం, డోలు, శాక్సోఫోన్, గాత్రం) ఆధ్యాత్మికం, ఉపాధి కల్పన తదితర రంగాల్లో ప్రతిభ కలిగిన వ్యక్తులు, చిన్నారులు అవార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. 

రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో జరిగే ఎంపిక ప్రక్రియలో భాగంగా రాష్ట్ర స్థాయి ‘ఆంధ్ర రత్న’ ‘తెలంగాణ రత్న’ ‘ స్టేట్ బెస్ట్ సిటిజన్ ’అవార్డులతో పాటు, ఇద్దరు  అత్యుత్తమ టీచర్లకు ‘సర్వేపల్లి రాధాకృష్ణన్’ ఇతర రంగాల్లో సేవలందించిన పదిమందికి ‘ నేషనల్ బెస్ట్ సిటిజన్’ ‘లైఫ్ టైం అచీవ్ మెంట్ ’ అవార్డులను అందజేస్తామని వెల్లడించారు. ఏదైనా మూడు రంగాల్లో విశేష ప్రతిభ కలిగిన ఇద్దరికి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘భారత ప్రతిభా రత్న’ అందజేయనున్నామని వివరించారు. ఆసక్తికలిగిన వారు తమ దరఖాస్తులను 7780589775  వాట్సాప్ నంబర్ కు  ఆగస్టు 7వ తేదీ లోగా పంపాలని సూచించారు. ఎంపికైన వారికి అదేనెల 28న హైదరాబాద్​లోని పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ ఆడిటోరియంలో అవార్డులను సినీ, రాజకీయ, అధికార ప్రముఖుల చేతుల మీదుగా  ప్రదానం చేస్తామని విజయ్ కుమార్ పేర్కొన్నారు.