ఎన్నికల పరిశీలనకు జనరల్ అబ్జర్వర్లు.. 8 మంది ఐఏఎస్​ల నియామకం

ఎన్నికల పరిశీలనకు జనరల్ అబ్జర్వర్లు.. 8 మంది ఐఏఎస్​ల నియామకం

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పరిశీలనకు  కేంద్ర ఎన్నికల సంఘం 8 మంది ఐఏఎస్ అధికారులను సాధారణ పరిశీలకులుగా నియమించిందని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. వీరంతా శుక్రవారం హైదరాబాద్​కు చేరుకున్నారని చెప్పారు. 

చార్మినార్,- చాంద్రాయణగుట్ట అసెంబ్లీ స్థానాలకు జనరల్ అబ్జర్వర్​గా నియమితులైన సమీర్ వర్మ  జీహెచ్ఎంసీ హెడ్డాఫీసుకు వచ్చారు.