హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పరిశీలనకు కేంద్ర ఎన్నికల సంఘం 8 మంది ఐఏఎస్ అధికారులను సాధారణ పరిశీలకులుగా నియమించిందని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. వీరంతా శుక్రవారం హైదరాబాద్కు చేరుకున్నారని చెప్పారు.
చార్మినార్,- చాంద్రాయణగుట్ట అసెంబ్లీ స్థానాలకు జనరల్ అబ్జర్వర్గా నియమితులైన సమీర్ వర్మ జీహెచ్ఎంసీ హెడ్డాఫీసుకు వచ్చారు.