చంద్రబాబు అరెస్ట్..ఆర్టీసీ బస్సులు బంద్

చంద్రబాబు అరెస్ట్..ఆర్టీసీ బస్సులు బంద్

చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో  ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా  ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లోని బస్సులన్నీ డిపోల కే పరిమితమయ్యాయి. 

 కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అన్ని బస్సులను నిలిపివేశారు పోలీసులు. అటు విజయవాడలోనూ అదే పరిస్థితి. ఉదయం నుంచి  సిటీ బస్సులు  రోడ్లపైకి రాలేదు. విశాఖపట్టణంలోని ద్వారక బస్‌స్టేషన్‌లో ప్రయాణికులను కిందికి దించి మరీ బస్సులను డిపోలకు తరలించారు. టికెట్ తీసుకున్న ప్రయాణికులకు డబ్బులు తిరిగి ఇచ్చారు. అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరు డిపోల నుంచి కూడా బస్సులు బయటకు రాలేదు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా బస్సులు ఎక్కడికక్కడ నిలిపివేశారు.