హైదరాబాద్, వెలుగు: ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ఎప్సెట్ కు మంగళవారం నాటికి 44,938 అప్లికేషన్లు అందాయని సెట్ కన్వీనర్ దీన్ కుమార్ తెలిపారు.
ఇంజనీరింగ్ కోసం 28,858 మంది, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కోసం 16,038 మంది, రెండింటి కోసం 43 మంది అప్లై చేసుకున్నారని చెప్పారు. గత నెల 26 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా, ఏప్రిల్ 4 వరకూ అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంది.