విజయవాడ: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళా ప్రయాణికురాలితో అసభ్యంగా ప్రవర్తించాడు డ్రైవర్. ఈ సంఘటన శుక్రవారం రాత్రి విజయవాడలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓ మహిళ అన్నవరం దగ్గర విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఏపీ31 జెడ్ 452లో ఎక్కింది. కొద్దిసేపటి తర్వాత శిరీష తన బెర్త్లో నిద్రించిన సమయంలో బస్సు రెండో డ్రైవర్ గురుమార్తి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు.
దీంతో ఆమె ఈ విషయాన్ని భర్తకు ఫోన్ చేసి చెప్పింది. అనంతరం భర్త సలహా మేరకు బెంజిసర్కిల్ వద్ద బస్సును ఆపి పోలీసులకు ఫిర్యాదు చేసింది. శిరీష ఫిర్యాదు మేరకు పటమటలంక పోలీసులు డ్రైవర్ గురుమార్తిని పోలీస్ స్టేషన్కు తరలించారు.