గ్రీన్ బడ్జెట్ పేరిట మరో అవినీతికి మున్సిపల్ పాలకులు సిద్ధం

గ్రీన్ బడ్జెట్ పేరిట మరో అవినీతికి మున్సిపల్ పాలకులు సిద్ధం

ఆర్మూర్, వెలుగు: గ్రీన్ బడ్జెట్ పేరుతో మరో అవినీతికి మున్సిపల్ పాలకులు సిద్ధమవుతున్నారని ఆర్మూర్ బీజేపీ లీడర్లు ఆరోపించారు.
 ఆదివారం ఎమ్మెల్యే క్యాంప్  ఆఫీస్ ముందు నిరసన తెలిపి సిబ్బందికి మెమోరాండం ఇచ్చారు.

బీజేపీ మున్సిపల్ ​ఫ్లోర్ ​లీడర్​ జీవీ నర్సింహారెడ్డి, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్​కుమార్​మాట్లాడుతూ.. గ్రీన్ బడ్జెట్ పేరుతో దాదాపు రూ. 25 లక్షలు దోచుకునేందుకు యత్నిస్తున్నారన్నారు. ఆర్మూర్ అంగడి ప్రాంగణంలో నాటాల్సిన మూడు వేల మొక్కలను డంపింగ్ యార్డ్ లో పడేసి, నాటినట్లుగా డబ్బులు డ్రా చేసుకున్నారని ఆరోపించారు.

టౌన్​లో అపరిశుభ్ర వాతావరణంతో ప్రజలు అనారోగ్యం పాలవుతుంటే పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. మున్సిపాలిటీలో అవినీతి, అక్రమాలు, భూకబ్జాలు తప్ప అభివృద్ధి ఏమీ లేదన్నారు. ఈ విషయాలన్నీ ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో బుద్ధి  చెప్తారన్నారు.