- హమ్ విజయ్ పేరుతో బలప్రదర్శనకు మన ఆర్మీ రెడీ
న్యూఢిల్లీ: మన సైనిక దళాలు చైనా బోర్డర్లోని అరుణాచల్ ప్రదేశ్లో లేటెస్ట్ వెపన్స్ సిస్టమ్ను వినియోగించాలని ప్లాన్ చేస్తున్నాయి. వార్ రిహార్సల్స్లో భాగంగా తూర్పుప్రాంతాన్ని ఆర్మీ వేదికగా ఎంచుకుంది. ఈ మధ్యనే అమెరికా నుంచి కొన్న ఆయుధాలతోపాటు ఎం-777 ఆల్ట్రా లైట్ హొవిడ్జర్, ఛినూక్ హెవీ లిఫ్ట్ హెలికాప్టర్లను కూడా అరుణాచల్లో టెస్ట్ చేయనున్నట్టు సైనిక వర్గాలు చెప్పాయి. చండీగఢ్ ఎయిర్బేస్ కేంద్రంగా ఉన్న ఎయిర్ఫోర్స్లోకి ఛినూక్ హెవీ లిఫ్ట్ హెలికాప్టర్లను ఈ ఏడాది మార్చి 25న చేర్చుకున్నారు.ఆర్మీ చేపట్టనున్న ఎక్స్ర్ సైజ్కు ‘హమ్ విజయ్’ అని పేరు పెట్టారు. కొత్తగా ఆర్మీలోకి తీసుకున్న 17 మౌంటెయిన్ స్ట్రయిక్స్ కోర్ యుద్ధ నైపుణ్యాలు ఎలా ఉంటాయో కూడా తెలుసుకుంటారు.
- ఇండియన్ ఆర్మీ 145 ఎం-777 ఆల్ట్రా లైట్ హోవిడ్జర్లను వినియోగించనుంది.
- మౌంటెయిన్ స్ట్రయిక్స్ కోర్ కు చెందిన 5 వేల ట్రూప్లు వార్ హార్సల్స్లో పాల్గొంటాయి.
- రి హార్సల్స్లో భాగంగా ఆర్మీ ట్రూప్లను వెస్ట్ బెంగాల్లోని బగ్దోగ్రా నుంచి అరుణాచల్ప్రదేశ్ లోని ‘వార్జోన్’
దగ్గరకు ఎయిర్లిఫ్ట్ చేస్తారు.
హమ్ విజయ్ ఎక్సర్సైజ్లో భాగంగా 17 మౌంటెయిన్ స్ట్రయి క్స్ కోర్ కు ఎం777 ఆల్ట్రా లైట్ హోవిడ్జర్లను యాడ్ చేస్తారు. శత్రువు ఎక్కడున్నాడో
తెలుసుకుని ఎటాక్ చేసేందుకు వీలుగాహోవిడ్జర్లతో వీలవుతుం ది. వీటికితేలికపాటి గన్స్ ఉంటే సరిపోతాయి.
– ఆర్మీ వర్గాలు
నార్త్ఈస్ట్లో ఛినూక్ హెలికాప్టర్లనుఎయిర్ఫోర్స్ ఇంతవరకువినియోగించలేదు. భవిష్యత్తులోఈప్రాంతంలో ఈ హెలికాప్టర్లనువినియోగించాలని ప్లాన్ చేస్తున్నారు.అందుకోసమే వార్ రిహార్సల్స్ లో వీటిని వాడుతున్నారు.
– సైనిక ప్రతినిధి