అనంతగిరి గుట్టపై తాగునీటికి ఏర్పాట్లు

అనంతగిరి గుట్టపై తాగునీటికి ఏర్పాట్లు

వికారాబాద్, వెలుగు: అనంతగిరి స్వదేశీ దర్శన్ ప్రాజెక్టులో భాగంగా అనంతగిరి గుట్టపై పర్యాటకులకు తాగునీటి వసతి కల్పించడానికి రూ.6 కోట్లతో తాగునీటి సరఫరా పథకానికి శుక్రవారం అసెంబ్లీ స్పీకర్​ గడ్డం ప్రసాద్​కుమార్​ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్​ ప్రతీక్​ జైన్​, ఆర్డీవో వాసుచంద్ర, కలెక్టర్​ హర్షచౌదరి, కాంగ్రెస్​ నాయకులు సుధాకర్​రెడ్డి, చిగుర్లపల్లి రమేశ్​కుమార్​,  రంగరాజ్​తదితరులు పాల్గొన్నారు.