
వికారాబాద్, వెలుగు: అనంతగిరి స్వదేశీ దర్శన్ ప్రాజెక్టులో భాగంగా అనంతగిరి గుట్టపై పర్యాటకులకు తాగునీటి వసతి కల్పించడానికి రూ.6 కోట్లతో తాగునీటి సరఫరా పథకానికి శుక్రవారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్ జైన్, ఆర్డీవో వాసుచంద్ర, కలెక్టర్ హర్షచౌదరి, కాంగ్రెస్ నాయకులు సుధాకర్రెడ్డి, చిగుర్లపల్లి రమేశ్కుమార్, రంగరాజ్తదితరులు పాల్గొన్నారు.