ఉద్యోగాల పేరుతో మోసం: ముగ్గురు సభ్యుల ముఠా అరెస్ట్

ఉద్యోగాల పేరుతో మోసం: ముగ్గురు సభ్యుల ముఠా అరెస్ట్

నిరుద్యోగులే టార్గెట్ గా మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. లక్నో కు చెందిన షాను అన్సారీ, రిషబ్ మల్హోత్రా, వైభవ్ మహాజన్ ముగ్గురు వ్యక్తులు.. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశారు. కెరియర్ సైట్ పేరుతో నకిలీ వెబ్ సైట్ క్రియేట్ చేసి నిరుద్యోగులను టార్గెట్ చేసుకునేవారని పోలీసులు తెలిపారు. లాక్ డౌన్ సమయంలో ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయిన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ  చీటింగ్ చేశారన్నారు. లక్నో కేంద్రంగా పనిచేసిన ఈ ముగ్గురు వ్యక్తులు … నౌకరీ డాట్ కాం, టైమ్స్ జాబ్ డాట్ కాం వెబ్ సైట్ లలో ఉద్యోగం కోసం రిజిస్టర్ చేసుకున్న వారి వివరాలు సేకరించి మోసం చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ కు చెందిన ఓ మహిళకు MNC కంపెనీ లో ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఏకంగా 38 లక్షలు కాజేసినట్లు తెలిపారు. ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడిన ఈ ముగ్గురు వ్యక్తులు కూడా విద్యార్థులేనని చెప్పారు పోలీసులు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.