మే 10న మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్​ రెడ్డి రాక

మే 10న మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్​ రెడ్డి రాక

నకిరేకల్,  వెలుగు :  భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్   అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి  తరఫున ప్రచారం చేసేందుకు  ఈ నెల 10న నకిరేకల్ పట్టణానికి కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ  ఇన్​చార్జి మల్లికార్జున ఖర్గే,    ముఖ్యమంత్రి  అనుముల రేవంత్ రెడ్డి  వస్తున్నట్టు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం  తెలిపారు. అందుకోసం మినీ స్టేడియంలో  నిర్వహించే సభాస్థలాన్ని ఎమ్మెల్యే   పరిశీలించారు.