5 వేల మందికి పైగా పిల్లలతో కలిసి అరుణ్ ఐస్క్రీమ్స్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. జూబ్లీహిల్స్ లో జరిగిన కార్యక్రమంలో ఒకేసారి 5,113 మంది విద్యార్థులు ఒకే చోట చేరి రియల్ మిల్క్, క్రీమ్తో తయారైన స్ట్రాబెర్రీ బార్లు, కారామెల్ సాండ్విచ్, చాక్లెట్ కోన్స్ను నిరంతరం 30 నిమిషాల పాటు ఆస్వాదిస్తూ ఈ రికార్డును సాధించారు. ఈ సందర్భంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు అరుణ్ ఐస్క్రీమ్ యాజమాన్యానికి అవార్డు, రికార్డు పత్రాలను అందజేశారు.– వెలుగు, జూబ్లీహిల్స్
