
- ప్రతిపక్ష నేతలకు కేజ్రీవాల్ లెటర్
న్యూఢిల్లీ: ఢిల్లీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్పై తమ వైఖరేంటో చెప్పాలని ప్రతిపక్షాలను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కోరారు. ఈ నెల 23న పాట్నాలో జరగనున్న మీటింగ్లో దీనిపై చర్చించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రతిపక్ష నేతలకు ఆయన లెటర్ రాశారు. ‘‘ఇది కేవలం ఢిల్లీకి సంబంధించిన సమస్యనే కాదు. ఇలాగే వదిలేస్తే, రేపు నాన్–బీజేపీ రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఆర్డినెన్స్ తీసుకొస్తారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల నుంచి అధికారాలను లాక్కుంటారు” అని అందులో పేర్కొన్నారు. కాగా, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు పాట్నాలో ప్రతిపక్షాల మీటింగ్ జరుగనుంది.