మూడోసారి..కేజ్రీవాల్ అనే నేను…

మూడోసారి..కేజ్రీవాల్ అనే నేను…

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అరవింద్ కేజ్రీవాల్ ముడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో లెఫ్టినెంట్  గవర్నర్ అనిల్ బైజల్ అరవింద్ చేత ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఢిల్లీ ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరారు.

అరవింద్ కేజ్రీవాల్ తో పాటు ఆరుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు. మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్, గోపాల్ రాయ్, కైలాష్ గెహ్లోట్, ఇమ్రాన్ హుస్సేన్, రాజేంద్ర పాల్ గౌతమ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.