
క్రియేటీవ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram gopal varma) ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర రాజకీయాలపై ఒక సినిమా తియ్యబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అది కూడా రెండు భాగాలుగా ఈ సినిమా రానుంది. అందులో మొదటి భాగానికి వ్యూహం( Vyooham ), రెండో భాగానికి శపథం(Shapatham) అనే టైటిల్స్ కూడా ఫిక్స్ చేశాడు వర్మ.
RGV సోషల్ మీడియాలో వ్యూహం నుంచి లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు. కాగా రేపు (ఆగష్టు 15) ఉదయం 11 గంటలకి ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా వ్యూహం మూవీ నుంచి సెకండ్ టీజర్ రాబోతున్నట్లు..పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో సీఎం జగన్ జైలు జీవితం గడిపే టైంలో జగన్ వైఫ్ వైస్ భారతి జైలు లో కలిసి మాట్లాడే పోస్టర్ ఆసక్తి కలిగిస్తోంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాన్స్,పొలిటిషన్స్..టీజర్ ఎలా ఉండబోతోందనే ఆలోచనలు స్టార్ట్ అయ్యాయి.
ఇక వ్యూహం నుంచి రిలీజైన టీజర్ 1 సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఇందులో YSRకు జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంతో మొదలైన ఈ టీజర్. హెలికాఫ్టర్ ప్రమాదం, YSR మరణం, ఆ తర్వాత ఏం జరిగింది, ఎవరు ఎలా రియాక్ట్ అయ్యారు, జగన్ ను కొనడానికి పార్టీ పెద్దలు రావడం, జగన్ ను అరెస్ట్ చేసే సన్నివేశాలు, జగన్ పార్టీ పెట్టడం వంటి సీన్స్ ను కళ్ళకు కట్టినట్టు చూపించాడు రామ్ గోపాల్ వర్మ. ఇక టీజర్ చివర్లో జగన్ చెప్పిన.. నేనలా చేయడానికి చంద్రబాబుని అనుకున్నావా అనే డైలాగ్ టీజర్ కు హైలెట్ గా నిలిచింది. దీంతో సెకండ్ టీజర్ ఎలా ఉండబోతోందనే ఆసక్తి కలిగించారు RGV.
వ్యూహం మూవీని రామదూత క్రియేషన్స్ పతాకంపై రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సీఎం జగన్గా అజ్మల్, భారతీగా మానస నటిస్తున్నారు.
VYOOHAM teaser 2 is getting independence tmrw on INDEPENDENCE day at 11 AM pic.twitter.com/61XyCtimYq
— Ram Gopal Varma (@RGVzoomin) August 14, 2023