స్టూడెంట్లతో పిండి పిసికించి.. పూరీలు చేయించారు

స్టూడెంట్లతో పిండి పిసికించి.. పూరీలు చేయించారు

ఆసిఫాబాద్, వెలుగు: సెలవు దినం రోజున సరదాగా గడపాల్సిన స్టూడెంట్లతో ఆశ్రమ పాఠశాల సిబ్బంది పిండి పిసికించి పూరీలు చేయించారు. ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం హట్టి ఆశ్రమ పాఠశాలలో ఆదివారం ఉదయం ఈ చిత్రం ‘వెలుగు’ కెమెరాకు చిక్కింది. ఈ స్కూల్​లో 300 మంది స్టూడెంట్లు చదువుతుండగా.. వీరి కోసం 10 మంది వంట మనుషులున్నారు.

అయినా స్కూల్​ సిబ్బందికి బదులు స్టూడెంట్లతో పిండి పిసికించి, పూరీలు తయారు చేయించారు. పిల్లలకు అన్ని రకాల వసతి కల్పించి విద్యాబోధన చేయాల్సిన హెచ్​ఎం, వార్డెన్ పిల్లలతో పనులు చేయించడంపై విమర్శలు వస్తున్నాయి.