పెద్దపల్లి జిల్లా ఓదేలులో రామగిరి ప్యాసెంజర్ రైలు, అంజనీ ఎక్స్ ప్రెస్ రైలు ఆగడానికి కేంద్ర రైల్వే శాఖ అనుమతిచ్చింది. ఈ నెల 8 నుంచి రైల్వే శాఖ అనుమతి పనులు అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ధన్యవాదాలు తెలిపారు.
జనవరి 31న కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను బీజేపీ జాతీయ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి కలిశారు. పెద్దపల్లిలోని ఓదేల మండలంలో పుష్ పుల్ రైల్, రామగిరి రైలును ఆగేలా చూడాలని మంత్రికి వినతి పత్రం అందజేశారు. దీంతో పాటు మంచిర్యాలలో ఫోటో బిజీ ఏర్పాటు చేయాలంటూ, దాని పనులు వేగవంతం చేయాలంటూ కోరారు. ఈ నేపథ్యంలోనే వివేక్ వెంకటస్వామి వినతికి కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.