జియాన్ (చైనా): ఆసియా రెజ్లింగ్ చాంపియన్ షిప్లో ఇండియా మహిళలు స్వర్ణం లేకుండానే పోరాటం ముగించారు. గోల్డ్ మెడల్ తెస్తారని ఆశలు పెట్టుకున్న సాక్షి మాలిక్ , వినేశ్ ఫోగట్ కూడా కాంస్యాలతోనే సరిపెట్టా రు. సాక్షి(62 కేజీలు), వినేశ్ (53కేజీలు) ఇద్దరూ శుక్రవారం జరిగిన తమ క్వార్టర్ ఫైనల్ బౌట్స్లో ఓడిపోయారు. అయితే వీరి ప్రత్యర్థులు ఫైనల్ చేరడంతో రెపిచేజ్ లో ఆడి కాంస్య పతకాలు సాధించారు. కాంస్య పతక పోరులో వినేశ్ 8-–1తో కినైయ్ పంగ్ (చైనా )పై విజయం సాధించగా, సాక్షి 9–6తో హ్యోన్ గ్యోం గ్ మన్ ( ఉత్తర కొరియా)పై గెలిచింది. మంజు కుమారి(59 కిలోలు), దివ్యాకక్రాన్ (68 కిలోలు) కూడా కంచు పతకాలు నెగ్గిన సంగతి తెలిసిందే.